మాకు మద్దతివ్వండి: వైఎస్ జగన్కు కేటీఆర్ ఫోన్
హైదరాబాద్: తెలంగాణలో శాసనమండలి ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలంటూ మంత్రి కె. తారకరామారావు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. త్వరలో ఎన్నికలు జరగనుండటంతో పార్టీ మద్దతు తమకు ఇవ్వాలని ఆయన కోరారు. అయితే.. కేటీఆర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా వైఎస్ జగన్ ఆలోచిస్తామని ఆయనకు తెలిపారు.
ఇప్పటికే అధికార పక్షం వివిధ పక్షాల మద్దతు కోరేందుకు సిద్ధమైంది. తెలంగాణలో ఉన్న సీపీఎం, సీపీఐ, ఎంఐఎంలను మద్దతు కావాలంటూ కేటీఆర్ సమాచారం పంపించారు.