బాకీ తీర్చలేదని కొడుకు, కూతురు కిడ్నాప్!


మెదక్: బాకీ తీర్చలేదని అప్పు తీసుకున్న వ్యక్తి కొడుకుని, కూతురిని వడ్డీ వ్యాపారి కిడ్నాప్ చేశాడు. గాదిరెడ్డిపల్లి గ్రామంలో ఈ దారుణం జరిగింది. స్వామి అనే వ్యక్తి తన అవసరాల నిమిత్తం నిజామాబాద్కు చెందిన ఒక వడ్డీ వ్యాపారి వద్ద కొంత డబ్బు తీసుకున్నాడు.



అయితే అతను ఆర్థిక ఇబ్బందువల్ల తీసుకున్న అప్పును సకాలంలో తీర్చలేకపోయాడు. దాంతో ఆ వడ్డీ వ్యాపారి స్వామి కొడుకుని, కూతురిని కిడ్నాప్ చేశాడు. బాధితుడు మెదక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top