క్రిస్మస్కు ముందే భక్తరామదాస!
-
డిసెంబర్ 15న ట్రయల్ రన్ -
ఆ తర్వాత వారం రోజుల్లో సీఎం చేతుల మీదుగా ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లోని భూములకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన భక్తరామదాస ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చేనెలలో నీటిని విడుదల చేయనున్నారు. క్రిస్మస్కు ముందుగానే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రాజెక్టును ఆరంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎస్సారెస్పీ స్టేజ్-2లోని డీబీ ఎం-60 కింద చిట్టచివరి 58,958 ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించేందుకు ఈ పథకాన్ని చేపట్టారు. 70 % వరకు పను లు పూర్తి కాగా మిగతా పనులను వచ్చేనెల 15 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. డిసెంబర్ 15న ట్రయల్న్ర్ నిర్వహించిన అనంతరం సీఎం చేతుల మీదుగా ప్రాజెక్టు ను ప్రారంభించనున్నారు.
త్వరలో ‘సీతారామ’పనులు
సీతారామ ఎత్తిపోతల పథకం తొలి దశ పనులు వచ్చేనెల నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం కాంట్రాక్టు పనులను దక్కించుకున్న సంస్థల సాంకేతిక అర్హతలను పరిశీలిస్తున్నారు. ఇది పూర్తవగానే ఒప్పం దాల ప్రక్రియ మొదలవుతుంది. ఇదంతా వారంలో పూర్తి చేసి పనులు ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు.