నిమ్స్లో కేకేను పరామర్శించిన కేసీఆర్
హైదరాబాద్: అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్లో చికిత్స పొందుతున్న టీఆర్ఎస్ సీనియర్నేత కే కేశవరావు సీఎం కేసీఆర్ పరామర్శించారు. సోమవారం నిమ్స్కు వచ్చిన కేసీఆర్.. కేకే ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను, నిమ్స్ సంచాలకులు డాక్టర్ మనోహర్ను అడిగి తెలుసుకున్నారు. కేకే మూత్ర సంబంధిత సమస్య, జ్వరంతో బాధపడుతూ నిమ్స్లో చికిత్స పొందుతున్నారు.