ప్రజలే మా బాస్ లు: కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ప్లీనరీ సమావేశంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర పాలనలో తనకు ప్రజలే 'బాస్'లు అని ప్రశంసించారు.
ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
-
లాఠీ దెబ్బలు తిన్నారు.. జైళ్లకు వెళ్లారు. -
బంగారు తెలంగాణ కోసం పాటుపడ్డారు. -
తెలంగాణ ప్రజలు సొంత రాష్ట్రం కోసం ఎన్నో బాధలు పడ్డారు. -
ఈ కష్టంలో భాగమైన ప్రతి ఒక్కరినీ కృతజ్ఞతలు. -
2001 లో పార్టీ ప్రారంభమైనప్పుడు నేను ఒక్కడినే. -
తర్వాత లక్షల మంది వచ్చి చేరారు. -
ఎన్ని ఆరోపణలు వచ్చినా నాతో కలిసి పని చేశారు. -
ఉద్యమాలతో ప్రారంభమైన పార్టీని నిలబెట్టింది మాత్రం ప్రజలే. -
పార్టీకి అధ్యక్షుడినే అయినా ప్రతి ఒక్క కార్యకర్త సలహాని స్వీకరించాం. -
ఎన్నో జయాలు చూశాం.. అపజయాలూ చూశాం. -
ఎన్ని ఇబ్బందులు వచ్చినా 14 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతూనే ఉన్నారు. -
పోరాటం అంటే ఎన్నడూ వెన్ను చూపలేదు మన ప్రజలు. -
ఎన్ని కష్టాలొచ్చినా ఉద్యమాన్ని వీడలేదు.