ప్రజలే మా బాస్ లు: కేసీఆర్

ప్రజలే మా బాస్ లు: కేసీఆర్ - Sakshi


తెలంగాణ రాష్ట్ర సమితి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ప్లీనరీ సమావేశంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర పాలనలో తనకు ప్రజలే 'బాస్'లు అని ప్రశంసించారు.



ప్రసంగంలోని ముఖ్యాంశాలు..


  • లాఠీ దెబ్బలు తిన్నారు.. జైళ్లకు వెళ్లారు.

  • బంగారు తెలంగాణ కోసం పాటుపడ్డారు.

  • తెలంగాణ ప్రజలు సొంత రాష్ట్రం కోసం ఎన్నో బాధలు పడ్డారు.

  • ఈ కష్టంలో భాగమైన ప్రతి ఒక్కరినీ కృతజ్ఞతలు.

  • 2001 లో పార్టీ ప్రారంభమైనప్పుడు నేను ఒక్కడినే.

  • తర్వాత లక్షల మంది వచ్చి చేరారు.

  • ఎన్ని ఆరోపణలు వచ్చినా నాతో కలిసి పని చేశారు.

  • ఉద్యమాలతో ప్రారంభమైన పార్టీని నిలబెట్టింది మాత్రం ప్రజలే.

  • పార్టీకి అధ్యక్షుడినే అయినా ప్రతి ఒక్క కార్యకర్త సలహాని స్వీకరించాం.

  • ఎన్నో జయాలు చూశాం.. అపజయాలూ చూశాం.

  • ఎన్ని ఇబ్బందులు వచ్చినా 14 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతూనే ఉన్నారు.

  • పోరాటం అంటే ఎన్నడూ వెన్ను చూపలేదు మన ప్రజలు.

  • ఎన్ని కష్టాలొచ్చినా ఉద్యమాన్ని వీడలేదు.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top