ఓ ఆంగ్ల దినపత్రికపై నిప్పులు చెరిగిన కేసీఆర్!

ఓ ఆంగ్ల దినపత్రికపై నిప్పులు చెరిగిన కేసీఆర్! - Sakshi

హైదరాబాద్: ఓ ఆంగ్ల దినపత్రికపై తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ ను పక్కన పెట్టారంటూ ఓ ఆంగ్ల దిన పత్రిక కథనంపై కేసీఆర్ స్పందించారు. బడ్జెట్ రూపకల్పనలో మంత్రి ఈటెలను పట్టించుకోవడం లేదని, బడ్జెట్ అంశాలను చదివే విధంగా నామమాత్రపు పాత్రకే కేసీఆర్ పరిమితం చేస్తున్నారంటూ ఆంగ్ల దినపత్రిక కథనంలో పేర్కొంది. 

 

పత్రిక వెల్లడించిన కథనమంతా ఓ చెత్త అంటూ కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ రూపకల్పన అనే అంశం ఏ ఒక్కరికి పరిమితం కాదు. అదోక టీమ్ వర్క్. వివిధ మంత్రుల సిఫారసులను పరిగణనలోకి తీసుకుని బడ్జెట్ రూపకల్పన ఉంటుంది. 

 

ఆ పత్రిక వెల్లడించిన కథనంలో వాస్తవాలు లేవన్నారు. సెన్సెషనల్ హెడ్ లైన్స్ కోసం రాసే వార్తలు తప్పుడు సంకేతాలను పంపుతాయని కేసీఆర్ అన్నారు. ఆతర్వాత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మీడియా సహకారం అందించాలని కేసీఆర్ విజ్క్షప్తి చేశారు. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top