'కవిత పదవి కోసం.. కేసీఆర్ చక్కర్లు'
మహబూబ్ నగర్: రూ. లక్షా 15వేల బడ్జెట్లో రూ.2వేల కోట్ల ఉపకార వేతనాలు చెల్లించకపోవడం దారుణమని, తెలంగాణ ప్రభుత్వం పై తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కమీషన్ల కక్కుర్తితోనే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడం లేదన్నారు. ఆఖరికి విద్యార్థులకు పెట్టే అన్నంలోనూ అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. తన కుమార్తె, టీఆర్ఎస్ ఎంపీ కవిత కేంద్రమంత్రి పదవి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారని రేవంత్ విరుచుకుపడ్డారు.