ఆగస్టులో సింగపూర్‌కు సీఎం కేసీఆర్


ఐఐఎం పూర్వ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగం




 సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం) పూర్వ విద్యార్థుల అసోసియేషన్ నిర్వహించే సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ఆగస్టు 22-23 తేదీల్లో సీఎం కేసీఆర్ సింగపూర్ వెళ్లనున్నారు. ఐఐఎం అలుమ్ని సింగపూర్ నుంచి ఆహ్వానం అందుకున్న తొలి సీఎం కేసీఆర్ కావడం గమనార్హం. కొత్త రాష్ర్టంలో ఉన్న పెట్టుబడి అవకాశాలు, పారిశ్రామిక విధానాలతో పాటు ఐఐఎం అలుమ్ని ఎలాంటి పాత్ర పోషించాలనే అంశంపై సదస్సులో మాట్లాడాలని అలుమ్ని కోరింది. ఇంపాక్ట్ 2014 పేరుతో జరగనున్న ఈ రెండు రోజుల కార్యక్రమానికి సింగపూర్ ప్రధాని లీహ్సీన్ లూంగ్, అధ్యక్షుడు ఎస్‌ఆర్. నాథన్, డిప్యూటీ ప్రధాని థర్మన్ షణ్ముగరత్నం, మంత్రి ఎస్.ఈశ్వరన్ హాజరుకానున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top