కేంద్రం ఏమిచ్చిందంటే...

కేంద్రం ఏమిచ్చిందంటే... - Sakshi


గవర్నర్‌తో సీఎం భేటీ

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం సాయంత్రం గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు. దాదాపు అరగంట సేపు చర్చలు జరిపారు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితులపైనే చర్చ జరిగినట్లు సమాచారం. తెలంగాణకు కేంద్రం రూ.లక్ష కోట్లు ఇచ్చిందన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా వ్యాఖ్యల నేపథ్యంలో ఈ విషయంలో వాస్తవాలను గవర్నర్‌కు సీఎం నివేదించినట్లు తెలిసింది. గడిచిన మూడేళ్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఇచ్చిన నిధుల వివరాలన్నింటినీ గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది.


కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, విభజన చట్టం ప్రకారం తెలంగాణకు కేంద్రం ఇచ్చిన హామీల అమలు పురోగతిపై చర్చించినట్లు తెలిసింది. ఆదాయ వృద్ధిలో తెలంగాణ రాష్ట్రం 17.82 శాతం వృద్ధితో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో ఉన్నట్టు కాగ్‌ వెల్లడించిన గణాంకాలను కూడా గవ ర్నర్‌ దృష్టికి సీఎం తీసుకెళ్లినట్లు సమాచారం. ముస్లింలకు రిజర్వేషన్లను పెంచు తూ అసెంబ్లీ ఇటీవల చేసిన తీర్మానం కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top