ప్రధాని మోదీకి కెసిఆర్ లేఖ
హైదరాబాద్: పార్లమెంటుతోపాటు రాష్ట్రాల శాసనసభలలో సీట్ల సంఖ్య పెంచి, మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించేవిధంగా చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు లేఖ రాశారు. ఓబిసిలకు కూడా చట్ట సభలలో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కెసిఆర్ ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.
ఓబిసిల అభివృద్ధి కోసం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మూడ అంశాలపై తెలంగాణ శాసనసభ, శాసన మండలి తీర్మానం చేసినట్లు ఆ లేఖలో కెసిఆర్ తెలిపారు.
**