కేసీఆర్‌ బాల్య మిత్రుడికి గుండెపోటు.. మృతి

కేసీఆర్‌ బాల్య మిత్రుడికి గుండెపోటు.. మృతి - Sakshi

దుబ్బాక: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బాల్య మిత్రుడు కన్నుమూశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామానికి చెందిన ఆస దానయ్య (56) సోమవారం గుండెపోటుతో మరణించారు. సోమవారం ఉదయం దానయ్యకు గుండెపోటు రావడంతో చికిత్స నిమిత్తం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆయన తుదిశ్వాస విడిచారు.



దానయ్య 1985లో టీడీపీ హయాంలో సిద్దిపేట వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మొట్టమొదటి చైర్మన్‌గా పనిచేశారు. సీఎం కేసీఆర్‌తో దానయ్య అత్యంత సన్నిహితంగా ఉండేవారు. వీధి బాగోతాలతోపాటు తన వాక్చాతుర్యంతో పలువురిని ఆకట్టుకునే వారు. మృతునికి ఐదుగురు కూతుళ్లు, ఇద్దరు కుమారులున్నారు. మంగళవారం ఉదయం రాజక్కపేటలో జరిగే దానయ్య అంత్యక్రియలకు మంత్రి హరీశ్‌రావు, శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌ సోలిపేట రామలింగారెడ్డి తదితరులు హాజరు కానున్నారు.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top