4న జిల్లాకు సీఎం
కరీంనగర్ : హరితహారం పథకం ప్రారంభించేందుకు 4న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు జిల్లాలో పర్యటించనున్నారు. హరితహారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ జూలై 4న సిద్దిపేట నియోజకవర్గంలో పర్యటన ముగించుకుని అదే రోజు హుస్నాబాద్ నియోజకవర్గంలోని బస్వాపూర్, హుస్నాబాద్ , చిగురుమామిడి, మానకొండూర్ నియోజకవర్గం కొత్తపల్లి, తిమ్మాపూర్, ఎల్ఎండీల మీదుగా కరీంనగర్కు చేరుకుంటారు. ఆయూ చోట్ల మొక్కలు నాటుతారు. అదేరోజు రాత్రి తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్లో బస చేస్తారు.
5న ఉదయం కరీంనగర్ పట్టణంలో ఏర్పాటు చేసే హరితహారంలో పాల్గొని పెద్దపల్లి పట్టణం, ధర్మపురి నియోజక వర్గంలోని ధర్మారం మీదుగా ఆదిలాబాద్ జిల్లాలోకి వెళ్తారు. కాగా, 4న యూదాద్రిలో రాష్ట్రప్రతి ప్రణబ్ముఖర్జీ పర్యటన ఉండనుందనే వార్తలు కూడా వినిపిస్తున్నారుు. అక్కడ ఆయన హరితహారం కార్యక్రమం ప్రారంభించే అవకాశమున్నందున ఒకవేళ ఆ పర్యటన ఖరారైతే ముఖ్యమంత్రి 4న జిల్లాకు వచ్చే అవకాశం లేదు. 5న నేరుగా కరీంనగర్ చేరుకుంటారని సమాచారం.