జనవరి 9 నుంచి కాకతీయ ఉత్సవాలు
హైదరాబాద్: తెలంగాణలో వచ్చే జనవరి 9 నుంచి 11 వరకు కాకతీయ మహోత్సవం జరగనుంది. తెలంగాణలోని పది జిల్లాల్లో మూడ్రోజుల పాటు కాకతీయ ఉత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
కాకతీయ సామ్రాజ్య వైభవం, వారసత్వ సంపద ప్రతిబింబించేలా ఉత్సవాలు జరగనున్నాయి. కళాకారులకు 1500 రూపాయలు పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పాపారావు తెలిపారు.