రేవంత్ రిమాండ్ పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: 'ఓటుకు కోట్లు' కేసులో నిందితులైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి, ఉదయసింహ, సెబాస్టియన్ల రిమాండ్ను ఏసీబీ ప్రత్యేక కోర్టు జూలై 13 వరకు పొడిగించింది. వారిని సోమవారం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి లక్ష్మీపతి ఎదుట హాజరుపర్చారు. ఈ కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున వారి రిమాండ్ను పొడిగించాలని కోరుతూ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది.
నిందితులు పలుకుబడి ఉన్న వ్యక్తులని, బయటకొస్తే సాక్షులను ప్రభావితం చేయడంతోపాటు ఆధారాలను మాయం చేసే అవకాశం ఉందని చెప్పారు. దీంతో న్యాయమూర్తి నిందితులు ముగ్గురి రిమాండ్ను 13 వరకు పొడిగించగా.. పోలీసులు వారిని చర్లపల్లి జైలుకు తరలించారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్టై జైల్లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి బెయిల్ పిటిషన్పై హైకోర్టు తీర్పు మంగళవారం వెలువడనుంది.