జియో ట్యాగింగ్ పూర్తి చేయాలి
వరంగల్ అర్బన్: మహానగర పాలక సంస్థ పరిధిలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను సకాలంలో జియో ట్యాగింగ్ పూర్తి చేయాలని అడిషనల్ కమిషనర్ షాహిద్ మసూద్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం గ్రేటర్ ప్రధాన కార్యాలంలో వ్యక్తిగత మరుగుదొడ్ల పురోగతిపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్ల మొదటి, రెండవ, మూడద దశ మరుగుదొడ్లకు సంబంధించిన ప్రక్రియలను జియోట్యాగింగ్ చేస్తే పూర్తి స్థాయి బిల్లుల అందుతాయని, అందుకే ఇంజినీరింగ్ సిబ్బంది, మెప్మా సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు. సమావేశంలో సెక్రటరీ నాగరాజ రావు, ఆస్కీ ప్రతినిధులు శ్రీనివాసచారి, రాజామోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు