రూ.10లక్షల విలువైన ఆభరణాలు చోరీ
ఖమ్మం (ఇల్లందు) : ఇల్లందు పట్టణం ఆమ్బజార్ వద్ద శ్యాంగోయల్ అనే రైస్ వ్యాపారి నుంచి ఆభరణాలను దొంగలు చాకచక్యంగా అపహరించారు. వివరాల్లోకి వెళ్తే .. ఆమ్బజార్కు చెందిన శ్యాంగోయల్ రైస్ వ్యాపారి. తన వద్ద నగలు తనఖా పెట్టుకుని డబ్బులు అప్పు ఇస్తూ ఉంటారు. తనఖా పెట్టుకున్న నగలను రోజూ సాయంత్రం ఇంటికి తీసుకెళ్లి మరుసటి రోజు షాపు వద్దకు తెస్తుంటాడు.
ఇదే క్రమంలో ఆయనను గమనించిన దొంగలు.. సోమవారం షాపు తెరిచే సమయంలో తనతో పాటు తెచ్చిన నగల బ్యాగును గోయల్ కింద పెట్టగా .. అదే అదనుగా దొంగలు నగలు ఉన్న ఆ బ్యాగును ఎత్తుకెళ్లారు. అందులో రూ.10 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఉన్నట్లు బాధితుడు తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.