తిరిగి కాంగ్రెస్ గూటికి జగ్గారెడ్డి
హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్యే టి.జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్తో గురువారం భేటీ అయిన అనంతరం కాంగ్రెస్పార్టీ చేరుతున్నట్టు తెలిపారు. తాను భారతీయ జనతా పార్టీలో చేరడం చారిత్రక తప్పిదమని జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడినందుకు సోనియాగాంధీకి క్షమాపణ చెబుతున్నానన్నారు.
కాగా గత సాధారణ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఆయన శాసనసభకు పోటీచేసి ఓడిపోయారు. తెలంగాణ ముఖ్యమంత్రి మెదక్ లోక్సభ సీటుకు రాజీనామా చేయడంతో వచ్చిన ఉప ఎన్నికల్లో జగ్గారెడ్డి.... బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి ఆ ఎన్నికల్లో కూడా ఓడిపోయారు. ఉప ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన బీజేపీలో ఇమడలేక, తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు.