కోమటిరెడ్డిపై నిప్పులు చెరిగిన జగదీశ్‌ రెడ్డి

కోమటిరెడ్డిపై నిప్పులు చెరిగిన జగదీశ్‌ రెడ్డి


నల్లగొండ: బత్తాయి మార్కెట్ శంకుస్థాపన సభలో కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిఫై మంత్రి జగదీష్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నాయకులకు ప్రజలే బుద్ది చెప్పా‍లన్నారు. గ్రామ గ్రామాన నిలదీయాలని విన్నవించారు. కోమటిరెడ్డి రెడ్డి నీ బెదిరింపులు నీ నాటకాలు నీ పక్కన వున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గర చూయించు అని నిప్పులు చెరిగారు.


కాంగ్రెస్ జులుం తెరాస పార్టీపై చూయించడం మంచిది కాదని, దాడులు చేస్తే ఇలానే ప్రతిఘటన ఉంటుందని హెచ్చరించారు. తాము ప్రజలకు మంచి చేస్తున్నామని..ఎవ్వరికీ భయపడమన్నారు. బత్తాయి మార్కెట​ శంకుస్థాపన సభలో కాంగ్రెస​- టీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య బాహా బాహీ జరగడంతో మంత్రి జగదీశ్‌ రెడ్డి పై విధంగా స్పందించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top