మా ప్రమేయం లేదు: మంత్రి

మా ప్రమేయం లేదు: మంత్రి - Sakshi


నల్లగొండ: రెండు పడకల ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో తమ ప్రమేయం ఎంతమాత్రం ఉండదని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఈ పథకం కింద ఇండ్ల నిర్మాణం జరగాల్సిన గ్రామాలను మాత్రమే తాము గుర్తిస్తామని స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌లో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాలపై సమీక్షా సమావేశం జరిగింది.



ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అస్సలు ఇల్లు లేని వారితో పాటు పూర్తిగా పూరి గుడిసెల్లోనూ, రేకుల ఇండ్లలో ఉండే వారిని లబ్దిదారులుగా చేస్తే ఎంపిక సులభతరమవుతుందని సూచించారు. ఇండ్ల స్థలాల గుర్తింపులో గ్రామాల నాయకులను, పెద్దలను పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుందన్నారు. లబ్దిదారుల ఎంపిక బాధ్యత పూర్తిగా అధికారులదేనన్నారు. దీనిపై ఆర్డీవోలు తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, భాస్కర్ రావుతోపాటు అధికారులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top