డ్రంక్ అండ్ డ్రైవ్తో అనర్ధాలు: జబర్దస్త్ నటుడు
వరంగల్: వరంగల్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ జరిగింది. స్థానిక ఐఎంఏ హాలులో ఏసీపీ, ట్రాఫిక్ ఇన్చార్జి చైతన్య కుమార్ ఆధ్వర్యంలో ఈ కౌన్సలింగ్ నిర్వహించారు. 110 మందిపై కేసు నమోదు చేయగా ముగ్గురికి జైలు శిక్ష విధించారు. మొత్తం రూ. 1,35,700 జరిమానా వసూలు చేశారు. ఈ కార్యక్రమంలో ‘జబర్దస్త్’ వెంకీ కూడా పాల్గొని డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కలిగే అనర్ధాల గురించి వివరించారు.
సమాజంలో డ్రంక్ డ్రైవ్ కేసులు పెరిగిపోయాయి. మద్యం సేవించి డ్రైవింగ్ చేయటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని సందర్భాల్లో అమాయకులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇందుకు ఉదాహరణ నగరంలో సంవత్సరం క్రితం కొంత మంది యువకులు మద్యం సేవించి డ్రైవ్ చేయటం వల్ల ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
ఈ ప్రమాదంలో ఒకే కుంటుంబానికి చెందిన చిన్నపాప రమ్యతోపాటు మూడు తరాల వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. తమకు జరిగిన అన్యాయం మరో కుటుంబానికి జరగకుండా ఉండాలంటే రమ్య యాక్ట్ తీసుకొచ్చి దోషులను కఠినంగా శిక్షించాలని రమ్య తండ్రి డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.