ఇది ప్రభుత్వంపై వ్యతిరేకత కాదు:దేవీ ప్రసాద్

దేవీ ప్రసాద్ - Sakshi


హైదరాబాద్:  తెలంగాణ శాసనమండలి ఎన్నికలలలో తన ఓటమి ప్రభుత్వంపై వ్యతిరేకత కాదని  హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో పట్టుభద్రుల స్థానానికి టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన దేవీ ప్రసాద్ అన్నారు. ఈ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి   రామచంద్రరావు దాదాపు పదివేల ఓట్ల మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. 


ఫలితాలు వెలువడిన అనంతరం దేవీ ప్రసాద్ మాట్లాడుతూ తన ఓటమిని అంగీకరించారు. ఈ ఎన్నికలలో దాదాపు పది వేల ఓట్లు చెల్లలేదని చెప్పారు. తనకు ఓటు వేసినవారికి కృతజ్ఞతలు తెలిపారు.బీజేపీ గెలిచినప్పటికీ అధికార టీఆర్ఎస్కు వ్యతిరేక తీర్పుగా భావించలేం అని ఆయన అన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top