యాత్రికుల కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక రైళ్లు


సాక్షి, హైదరాబాద్: యాత్రికుల కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. రామేశ్వరం-కన్యాకుమారి-నాగర్‌సోయిల్-మధురై, ఢిల్లీ-జైపూర్-ఆగ్రా-మధుర ల మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్-రామేశ్వరం ట్రైన్ 2015 జనవరి 28, మార్చి 4 తేదీలలో బయలుదేరుతుంది. 5 రాత్రులు, 6 పగళ్లు ఈ పర్యటన ఉంటుంది. అలాగే 7 రాత్రులు, 8 పగళ్లతో కూడిన హైదరాబాద్-గోల్డెన్ ట్రయాంగిల్ పర్యటన 2015 ఫిబ్రవరి 20న ప్రారంభమవుతుంది. వివరాలకు 97013 60701,040-27702407 నంబర్లలో సంప్రదించవచ్చు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top