హాస్టల్ నుంచి విద్యార్థిని అదృశ్యం


హైదరాబాద్ : ఇంటర్ విద్యార్థిని కనిపించకుండాపోయిన ఘటన గోపాలపురం పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ మండలానికి చెందిన ఎ.శ్రావణి (18) సికింద్రాబాద్‌లోని వెస్లీ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతూ కళాశాల ఆవరణలోని హాస్టల్ ఉంటోంది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఓ బ్యాగుతో సహా కాలేజీ నుంచి బయటికి వెళ్లిన శ్రావణి తిరిగి హాస్టల్‌కు రాలేదు. తల్లిదండ్రులకు సమాచారం అందించిన నిర్వాహకులు ఎటువంటి జాడ తెలియకపోవటంతో శుక్రవారం గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top