కారు, ఆటో ఢీ: ఇంటర్ విద్యార్థి మృతి
సదాశివపేట్(మెదక్): మెదక్ జిల్లా సదాశివపేట్ మండల కేంద్రంలో మంగళవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఓ విద్యార్థి మృతిచెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సదాశివపేట్ సమీపంలోని ఎమ్మార్ఎఫ్ జహీరాబాద్ వైపు వేగంగా వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న సదాశివపేట్కు చెందిన ఇంటర్ విద్యార్థి విక్రంగౌడ్(18) అక్కడికక్కడే మృతి చెందగా, మరో విద్యార్థి జావెద్, ఆటో డ్రైవర్ రఫీయుద్దీన్ కు తీవ్ర గాయాలయ్యాయి.అతనికి కాళ్లు విరిగాయి. క్షతగాత్రులను సదాశివపేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.