'సర్వే పూర్తికి వారం రోజుల గడువు కోరతాం'

'సర్వే పూర్తికి వారం రోజుల గడువు కోరతాం' - Sakshi


హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో 19 లక్షల 53 వేల కుటుంబాల సమగ్ర సర్వే పూర్తయిందని నగర కమిషనర్ సోమేష్‌కుమార్ తెలిపారు. 21 లక్షల కుటుంబాలు హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించామని, దానికి సరిపడా సర్వే స్టేషనరీ ముద్రించామని చెప్పారు.



మిగిలిన ఇళ్లను సర్వ చేస్తామని అన్నారు. 100 శాతం సర్వే కోసం వారం రోజుల గడువు కోరుతామని వెల్లడించారు. ఈ ఉదయం వరకు సర్వే కొనసాగిందని తెలిపారు. జీహెచ్‌ఎంసీలో సవాల్‌గా స్వీకరించిన సమగ్ర కుటుంబ సర్వే విజయవంతమైందని ఆయన తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top