దేశాభివృద్ధిని ఓర్వలేని కాంగ్రెస్


♦ పార్లమెంట్ వ్యవస్థను కించపరుస్తున్నారు

♦ బీజేపీ సభలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హరిభాయి చౌదరి

 

 నల్లగొండ టూటౌన్ : ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ దానిని అడ్డుకుంటోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయి చౌదరి ఆరోపించారు. పార్లమెంట్‌లో సమావేశాలను కాంగ్రెస్ ఎంపీలు అడ్డుకున్నందుకు నిరసగా బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్ సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రపంచ దేశాలు మోదీ చేస్తున్న అభివృద్ధిని కీర్తిస్తుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం విమర్శలే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు.



భారతదేశం అభివృద్ధి చెందకుండా ఎప్పుడూ పేద దేశంగా ఉండాలనే వారు కోరుకుంటున్నారని ఆరోపించారు. మోదీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నారని తెలిపారు.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలు అడ్డుకున్న కాంగ్రెస్ నిజస్వరూపాన్ని ప్రజలకు తెలియజేసేందుకు కాంగ్రెస్ ఎంపీల నియోజకవర్గాల్లో సభలు పెడుతున్నామన్నారు. లోక్‌సభను అడ్డుకుంటే రాబోయేరోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుంటా చేస్తామని హెచ్చరించారు. బీదర్ ఎంపీ బగ్‌వంత్ కుంబు మాట్లాడుతూ దేశం అభివృద్ధి చెందితే గల్లంతు అవుతామనే కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని విమర్శించారు.



అనంతరం కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిలను పలువురు నాయకులు సత్కరించారు. అదే విధంగా బీజేపీ మహిళా మోర్చా నాయకులు కేంద్ర మంత్రికి రాఖీలు కట్టారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాకి పాపయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు,  డాక్టర్ మనోహర్‌రెడ్డి,  గోలి మధుసూదన్‌రెడ్డి,  బద్దం బాల్‌రెడ్డి, శ్రీరామోజు షణ్ముఖ, ఓరుగంటి రాములు, పల్లెబోయిన శ్యాంసుందర్,  వెంకటనారాయణరెడ్డి, ఎస్.కే.బాబా, విజయలక్ష్మి, పాదూరి కరుణ, విజయ, సునీత, చింతా ముత్యాల్‌రావు,  సాంబయ్య, కంకణాల శ్రీధర్‌రెడ్డి, బొజ్జ శేఖర్, బండారు ప్రసాద్, బొజ్జ నాగరాజు, రావుల శ్రీనివాస్‌రెడ్డి, గుండగోని గిరిబాబు, కొప్పు జయశ్రీ, పిండి పాపిరెడ్డి, పోతెపాక లింగస్వామి, గుండెబోయిన మల్లయ్య యాదవ్, జగ్జీవన్‌రామ్, కంభాలపల్లి కృష్ణ, మొరిశెట్టి నాగేశ్వర్‌రావు, చింతల సుజాత, పెరిక మునికుమార్, కూతురు సత్యవతి, లింగయ్య పాల్గొన్నారు.

 

 నాలుగు సీట్లు కూడా రావు : కిషన్‌రెడ్డి

 దేవరకొండ : కాంగ్రెస్ పార్టీ తన వ్యవహారశైలిని మార్చుకోకుండా,  రాహుల్‌గాంధీ పైజామా లేపుకుని ఎంత ఉరుకులాడినా రాబోయే ఎన్నికల్లో ప్రస్తుతమున్న 44 పార్లమెంటు సీట్లు కాదు కదా... 4 సీట్లు కూడా రావని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీల తీరును  ఎండగట్టేందుకు చేపట్టిన బీజేపీ బహిరంగ సభను బుధవారం దేవరకొండ పట్టణంలో నిర్వహించారు. ఈ బహిరంగ సభకు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్‌చౌదరి హాజరయ్యారు.



ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ  పైజామా పెకైత్తుకుంటూ నేను ప్రధాని అవుతానన్న రాహుల్‌గాంధీ పైజామా వదిలేసి విదేశాల్లో చడ్డీలతో రెండు నెలలు గయబ్ అయ్యాడని అలాంటి రాహుల్‌గాంధీ బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు.   ఎంపీ మోహన్ కుందా మాట్లాడుతూ మోదీ కన్నా శక్తిమంతమైన నేత దేశంలో ఎవరూ లేరన్నారు.  కార్యక్రమంలో  సాంబమూర్తి, మనోహర్‌రెడ్డి, బాల్‌రెడ్డి, సాంబమూర్తి,  రమేష్,  కరుణ,   బెజవాడ శేఖర్, నక్క వెంకటేష్‌యాదవ్,  వెంకటేష్‌యాదవ్, వెంకన్న, శ్రీధర్, జితేందర్, కాసం వెంకటేశ్వర్లు,  రాములు,   రవి, ఫణి, నారోజు పద్మ, చండీశ్వర్, బిక్కు, మేళ్ల వెంకటయ్య, శవ్వ యాదగిరి, పోలగోని గణేష్, హరి, వనం పుష్పలత, ఇడెం రామకృష్ణ, వస్కుల సుధాకర్, రెడ్డి శంకర్,  భాస్కర్ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top