ఇన్పుట్ సబ్సిడీపై ఆందోళన
బెజ్జంకి :
ఇన్పుట్ పరిహారం పంపిణీలో జాప్యంతోపాటు 1బీ అనుసంధానంతో అర్హులైన రైతులు, కౌలు రైతులకు అన్యాయం చేస్తున్నారని అఖిలపక్ష నేతలు ఆందోళనకు దిగారు. బెజ్జంకి క్రాసింగ్ రాజీవ్హ్రదారిపై స్థానిక కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, బీఎస్పీ, టీడీపీ నాయకులు రైతులతో కలిసి శుక్రవారం మహాధర్నా నిర్వహించారు. గంటన్నరపాటు ఆందోళన కొనసాగింది. ప్రభుత్వానికి, స్థానిక నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అఖిలపక్షనాయకులు, పో లీసులకు వాగ్వాదం, తోపులాట జరిగింది. తహశీల్దార్ ఈశ్వరయ్య చేరుకుని ఆందోళన విరమించాలని కోరా రు. కలెక్టర్ వచ్చి 1బీ లేకుండా, కౌలు రైతులకు నిబంధనలు లేకుండా పరిహారం అందిస్తామని హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని భీష్మించుకుని కూర్చున్నారు. బెజ్జంకి, తిమ్మాపూర్ ఎస్సైలు ఉపేందర్రావు, దామోదర్రెడ్డి,రాజమౌళి, ఆర్మీ సిబ్బంది అఖిలపక్షనాయకులను అదుపుతీసుకున్నా రు. వారిని వాహనంలో ఠాణాకు తరలించేందుకు ప్ర యత్నిస్తుండగా ఇతరులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని పోతారంమీదుగా ఠాణాకు తరలించారు.
మండల పరిషత్లో ఫర్నిచర్ ధ్వంసం
మహాధర్నా విరమించిన అఖిలపక్ష నాయకులు మండల పరిషత్ చేరుకుని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఈక్రమంలో వడ్లూరుకు చెందిన మాజీ సర్పంచ్ గాండ్ల తిరుపతి తలకు గాయమైంది. అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్సై ఉపేందర్రావు పరిశీలించారు. దాడికి పాల్పడిన వారిపై ఎంపీపీ ఒగ్గు దామోదర్, ఎంపీడీవో శ్రీనివాస్ వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఆందోళనలో కేడీసీసీబీ డెరైక్టర్ చింతలపల్లి రవీందర్రెడ్డి, నాయకులు అన్నాడి మల్లారెడ్డి, రామచంద్రం, కరివేద మహిపాల్రెడ్డి, తీగల మోహన్రెడ్డి, నగునూరి శంకర్, గూడెల్లి తిరుపతి, రూపేశ్, రైతులు పాల్గొన్నారు.