రోడ్డు ప్రమాదంలో ఇన్ఫోసిస్ ఉద్యోగి మృతి

రోడ్డు ప్రమాదంలో ఇన్ఫోసిస్ ఉద్యోగి మృతి - Sakshi


హైదరాబాద్: హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇన్ఫోసిస్ ఉద్యోగిని మృతి చెందింది. ఈ సంఘటన శంషాబాద్ సమీపంలోని హిమాయత్‌సాగర్ సమీపంలో ఈరోజు ఉదయం చోటుచేసుకుంది. నజియా సుల్తానా అనే ఇన్ఫోసిస్ ఉద్యోగిని కారులో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళేందుకు విమానాశ్రయానికి వెళుతుండగా మార్గమధ్యలోనే ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది.


 


దాంతో నజియా సుల్తానా అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు కాగా కారు డ్రైవర్ అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top