వివాహేతర సంబంధం.. వ్యక్తి దారుణహత్య
మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని అశోక్ రోడ్లో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. మహారాష్ట్రకు చెందిన భాగ్య గత కొన్నేళ్లుగా అశోక్ రోడ్లో నివాసముంటూ.. స్థానికంగా ఉండే చెక్కల శంకర్(30)తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. గత కొన్ని రోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో విసిగిపోయిన భాగ్య, శంకర్ను హతమార్చాలని భావించి మహారాష్ట్ర నుంచి తన కుమారుడిని పిలిపించింది. వీరిద్దరు కలిసి బుధవారం రాత్రి శంకర్ నిద్రిస్తున్న సమయంలో కర్రలతో దాడి చేసి హత్య చేశారు. అనంతరం ఇద్దరు పోలీసుల ఎదుట లొంగిపోయారు.