ప్రశాంతంగా టీఎస్ ఐసెట్


ఎంజీయూ(నల్లగొండ రూరల్)

 ఎంబీఏ, ఎంసీఓ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన టీఎస్ ఐసెట్ ఎంట్రెన్స్ పరీక్ష శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. జిల్లా కేంద్రంలోని 6 పరీక్షా కేంద్రాల్లో ఐసెట్ రీజినల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ అల్వాల రవి, రిజిస్ట్రార్ ఉమేష్ కుమార్, కేయూ ప్రొఫెసర్ జనార్ధన్‌రావు, రూట్ అధికారులు వెంకటాచారి, జాన్‌పాల్‌లు పరిశీలించారు. మొత్తం 2710 మంది అభ్యర్థులకు గాను 2540 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 170 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించమని అధికారులు ముందస్తుగానే ప్రకటించడంతో అభ్యర్థులంతా ముందస్తుగానే ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.

 

 కోదాడలో...

 కోదాడటౌన్ : ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశానికి నిర్వహించిన తెలంగాణ ఐసెట్-2015 ప్రవేశ పరీక్ష శుక్రవారం కోదాడలోని కేఆర్‌ఆర్ డిగ్రీ కళాశాలలో ప్రశాంతంగా ముగిసినట్లు పరీక్ష కో-ఆర్డినేటర్, కళాశాల ప్రిన్సిపాల్ అర్వపల్లి శంకర్ తెలిపారు. మొత్తం 550 మంది విద్యార్థులకు గాను 529 మంది హాజరయ్యారు. 21 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. నిమిషం ఆలస్యం అయితే పరీక్షకు అనుమతించరని విద్యార్థులు ఉరుకులు పరుగులతో సెంటర్‌కు చేరుకున్నారు. ఎండలు, వడగాల్పులు ఎక్కువగా ఉండడంతో విద్యార్థులతో పాటు నిర్వాహకులు ఇబ్బందులు పడ్డారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top