'ఈనెల 8న టీఆర్ఎస్ లో చేరుతున్నా'

'ఈనెల 8న టీఆర్ఎస్ లో చేరుతున్నా' - Sakshi


నిజామాద్:ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడిన మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ త్వరలో టీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన టీఆర్ఎస్ లో చేరబోతున్న విషయాన్ని శనివారం  సాయంత్రం వెల్లడించారు.  ఈ నెల 8 వ తేదీన తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు తెలిపారు. పదవులు ఆశించి టీఆర్ఎస్ లోకి వెళ్లడం లేదని పేర్కొన్నారు. తాను సీఎం పదవి మినహా అన్ని పదవులు పొందానన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.


 


అయితే కార్యకర్తలను తనతో రావాలని బలవంతం చేయడం లేదని డీఎస్ తెలిపారు. తెలంగాణ ఇచ్చింది ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అయితే.. రాష్ట్ర సాధనకు నాయకత్వం వహించింది కేసీఆరేనని మరోసారి పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top