'ఆ కేసులను చూసి గర్వపడుతున్నాం'


హైదరాబాద్:అన్ని క్రిమినల్ కేసులను ఒకే రకంగా చూడకూడదని టీఆర్ఎస్ ఎంపీ నర్సయ్య గౌడ్ అభిప్రాయపడ్డారు. తమ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తో పాటు తనపై కూడా కేసులు ఉన్నాయని.. అవి ఉద్యమంలో పెట్టిన కేసులని ఆయన స్పష్టం చేశారు. ఆ కేసులను చూసి తాము గర్వపడుతున్నామని ఈ సందర్భంగా నర్సయ్య గౌడ్ తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. క్రిమినల్ కేసులన్నింటినీ ఒకే రకంగా చూడకూడదన్నారు.  యాజమాన్య కోటాలో ఫీజులు పెంచడం పట్ల వస్తున్న విమర్శలపై స్పందించారు.


 


ఆ ఫీజుల పెంపును విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వ్యతిరేకించడం లేదని, ఫీజుల పెంపుతో విద్యార్థులకు లోన్లు కూడా వస్తాయని ఆయన తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top