అసెంబ్లీలో నేను ఒంటరిని

అసెంబ్లీలో నేను ఒంటరిని


రెడ్లు ఒకవైపు.. వెలమలు మరోవైపు: చిన్నయ్య



పెద్దపల్లి: ‘ఎవరి సామాజికవర్గం కోసం వారు కొట్లాడి హక్కులు సాధించాల్సిన అవసరం ఉంది.. శాసనసభ్యుడిగా కూడా నేను ఒంటరితనాన్ని అనుభవిస్తున్నా’ అని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. నేత కాని మహర్‌ రాష్ట్ర మహాసభ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగింది. సభకు రాష్ట్ర అధ్యక్షుడు గోమాస శ్రీనివాస్‌ అధ్యక్షత వహించగా, చిన్నయ్య హాజరై మాట్లాడారు. అసెంబ్లీ లో ఇప్పటికీ అగ్రవర్ణాలకు చెందిన రెడ్డి ఎమ్మెల్యేలు ఒకవైపు.. వెలమలు మరో వైపు మిగిలిన కులాల వారు తమతమ సామాజిక వర్గానికి చెందిన వారితో కలిసి వెళ్తున్నారన్నారు.



తాను నేతకాని మహర్‌ జాతికి చెందిన వాడిని కావడంతో ఒక్కడినే శాసనసభలో అడుగుపెట్టి ఒక్కడిగానే ఉంటున్నానన్నారు. రానున్న రోజుల్లో నేతకానీలు రాజకీయంగా ఎదిగి శాసనసభ, పార్లమెంట్‌లో ప్రవేశిస్తేనే న్యాయం జరుగుతుందన్నారు. మహాసభలో రాష్ట్ర వ్యవ స్థాపక అధ్యక్షుడు గోమాస శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top