ప్రపంచ మందుల మార్కెట్గా హైదరాబాద్...
హైదరాబాద్ : హైదరాబాద్ను ప్రపంచ మందుల మార్కెట్గా తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి హన్స్రాజ్ ఆహిర్ అన్నారు. హైదరాబాద్లో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మందుల మార్కెట్కు రూ.4500 కోట్లు, కరీంనగర్ జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారానికి రూ.5వేల కోట్లు కేటాయిస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఐడీపీఎల్కు పూర్వవైభవం తెస్తామన్నారు. త్వరలోనే ఐడీపీఎల్, ఎరువుల కర్మాగారాలను ప్రధాని నరేంద్ర మోదీచే ప్రారంభింపజేయాలని యోచిస్తున్నట్లు హన్స్రాజ్ ఆహిర్ వెల్లడించారు.
సంబంధిత వార్తలు