మద్యం మత్తులో భార్య, కొడుకు గొంతుకోసిన భర్త
మద్యానికి బానిసైన ఓ వ్యక్తి తన భార్య, కొడుకును అతిదారుణంగా హతమార్చిన ఘటన వరంగల్ జిల్లాలోని ఎస్ఎస్ఆర్ తోటలో బుధవారం చోటుచేసుకుంది. పీకలదాకా తాగి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన భర్త క్షణికావేశంలో తన భార్య, కొడుకు గొంతుకోశాడు.
దాంతో తీవ్ర రక్తస్రావమై వారిద్దరి పరిస్థితి విషమంగా మారింది. ప్రాణపాయ స్థితిలో ఉన్న వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.