భర్త చేతిలో భార్య హతం


వేములవాడ(కరీంనగర్ జిల్లా): వేములవాడలోని బద్దిపోచమ్మవీధిలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యనే కడతేర్చాడో భర్త. బద్దిపోచమ్మ వీధికి చెందిన రామిరెడ్డి(48), సుజాత(42) ఇద్దరూ భార్యాభర్తలు. కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న రామిరెడ్డి కోపోద్రిక్తుడై శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గొంతు నులిమి చంపాడు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వేములవాడ సీఐ శ్రీనివాస్ సంఘటనాస్థలాన్ని పరిశీలించారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top