భార్యను గొడ్డలితో నరికిన భర్త


నల్లగొండ: భార్యను హతమార్చేందుకు ఓ భర్త ప్రయత్నించాడు. ఆమెను మట్టుబెట్టేందుకు గొడ్డలితో దాడి చేశాడు. దీంతో సదరు మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన నల్లగొండ మండలం చందనపల్లిలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పాపయ్యకు ఆరేళ్ల కిందట నాగమణితో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. భార్య, భర్తలు ఇద్దరు తరచూ గొడవపడేవారు. శనివారం కూడా వీరి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో పాపయ్య, నాగమణిని గొడ్డలితో నరికాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పాపయ్యను ప్రతిఘటించి నాగమణిని ఆస్పత్రికి తరలించారు.


బాధితురాలు ప్రస్తుతం నగరంలోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top