నిజామాబాద్లో భారీ చోరీ
నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని హైమద్పురా కాలనీలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో గురువారం రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. 100 తులాల బంగారం, రూ. 50 వేల నగదు దోచుకెళ్లారు. ఇంటి యజమాని అబ్దుల్ హక్ జమీన్ ఖతార్లో ఉంటాడు. నగరంలో అతని భార్యా, పిల్లలు ఉంటారు. గురువారం ఇంట్లో వారంతా బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేసరికి ఈ చోరీ జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రత్యేక బృందాల సాయంతో నిందితుల కోసం గాలింపు చేపట్టారు.