నాడు ద్రోహులు.. నేడు దోస్తులా: నాగం

నాడు ద్రోహులు.. నేడు దోస్తులా: నాగం - Sakshi


తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగిన తీరుపై బీజేపీ సీనియర్ నాయకుడు నాగం జనార్దనరెడ్డి మండిపడ్డారు. టీ-టీడీపీ ఎమ్మెల్యేలు తెలంగాణ ద్రోహులని అభివర్ణించిన కేసీఆర్కు.. ఇప్పుడు వాళ్లు దోస్తులు ఎలా అయ్యారని నాగం ప్రశ్నించారు. ఏనాడూ తెలంగాణ జెండా పట్టనివాళ్లు, జై తెలంగాణ అనని వాళ్లు బంగారు తెలంగాణ ఎలా సాధిస్తారని నిలదీశారు.



టీఆర్ఎస్లో మంత్రిపదవులు ఇవ్వడానికి సమర్థులైన ఎమ్మెల్యేలే లేరా అని అడిగారు. ఇతర పార్టీల వారిని చేర్చుకుని, మంత్రిపదవులు ఇవ్వడం తెలంగాణ ప్రజలను అవమానపర్చడమేనని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం, బంగారు తెలంగాణ కేసీఆర్ వల్ల సాధ్యం కావని నాగం జనార్దనరెడ్డి విమర్శించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top