వాహనం ఢీకొని హోంగార్డు మృతి
నిజామాబాద్ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో గంగాధర్(35) అనే హోంగార్డు మృతి చెందాడు. బిర్కూర్ మండలం నాచుపల్లికి చెందిన గంగాధర్ బాన్సువాడలో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం విధులు ముగించుకుని బైక్పై నాచుపల్లికి వస్తుండగా అతడి బైక్ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గంగాధర్ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు.