ఇంటి విద్యుత్ బిల్లు రూ. 6.68 లక్షలు!
బాధితుడి ఫిర్యాదుతో సరిచేసి రూ.175 బిల్లు ఇచ్చిన ఏఈ
మెట్పల్లి(కోరుట్ల): ట్రాన్స్కో సిబ్బంది నిర్లక్ష్యం విద్యుత్ వినియోగదారులను షాక్కు గురి చేస్తుంది. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుని ఇంటికి ప్రతి నెలా విద్యుత్ బిల్లు రూ.300కు మించదు. కానీ, మే నెలలో ఏకంగా రూ.6.68,355 రావ డంతో అతను కంగుతిన్నాడు. జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యా యుడు గొల్కొండ నాగరాజుకు స్థానిక చైతన్యనగర్లో మూడుగదుల సొంతిల్లు ఉంది. దాన్ని ఓ కుటుంబానికి అద్దెకు ఇచ్చాడు.
అందులో విద్యుత్ మీటర్ అతని తండ్రి సీతారాం పేరు మీద ఉండగా, ఆ ఇంటికి ప్రతి నెలా రూ.150 నుంచి రూ.300 లోపు బిల్లు వస్తుంది. గత నెల 24న విద్యుత్ సిబ్బంది మీటర్ను చూసి బిల్లు రశీదు ఇచ్చి వెళ్లారు. వాస్తవానికి 76 యూనిట్ల విద్యుత్ వాడినట్లు మీటర్లో ఉంటే సిబ్బంది ఏకంగా 70076 యూనిట్లు వాడినట్లు రశీదు ఇచ్చారు. దీనికిగాను రూ.6.68,355 చెల్లించాలని అందులో ఉండడంతో నాగరాజు ఆశ్చర్యానికి గురై ట్రాన్స్కో ఏఈ భూమేశ్వర్ దృష్టికి తీసుకపోయారు. ఆయన సిబ్బందితో వచ్చి మీటర్ను పరిశీలించారు. సిబ్బంది నిర్లక్ష్యంతో ఇది జరిగిందని గుర్తించిన ఆయన తిరిగి రూ.175 రశీదు ఇవ్వడంతో బాధితుడు ఊపిరి పీల్చుకున్నాడు.