సింగరేణి నిప్పుల కొలిమి

సింగరేణి నిప్పుల కొలిమి - Sakshi


ఓసీపీపై 48 డిగ్రీలు నమోదు

బెంబేలెత్తుతున్న కార్మికులు

ఓసీపీల్లో మారిన పని వేళలు


శ్రీరాంపూర్‌ (మంచిర్యాల): భానుడి ప్రతాపా నికి సింగరేణి కార్మికులు బెంబేలెత్తుతున్నారు. వేసవి తీవ్రత అధికంగా ఉండ టంతో బొగ్గుబాయిలపై దీని ప్రభావం పడింది. మధ్యాహ్నం డ్యూటీలకు వెళ్లి పనిచే యడం కార్మికులకు ఇబ్బందిగా మారింది.  క్వారీల్లో 2 రోజులుగా 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవు తోంది. కార్మికులు ఎండబారిన పడకుండా ఉండేందుకు ఓపెన్‌ కాస్ట్‌ ప్రాజెక్ట్‌ (ఓసీ పీ)లో ఈ నెల 7వ తేదీ నుంచే షిఫ్ట్‌ వేళలు మార్చా రు.



ఉదయం షిఫ్ట్‌ ఇంతకు ముందు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటే దాన్ని ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే కుదించారు. 2వ షిఫ్ట్‌లో కూడా గంట సమయం కుదించి సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు నిర్వహిస్తు న్నారు.  పని చేసేటప్పుడు ప్రతి కార్మికుడికి మస్టర్‌ పడే సమయంలో మజ్జిగ ప్యాకెట్లు అందజేస్తున్నారు. నీరసంగా ఉందన్న కార్మి కులకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు ఇస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top