టీ సర్కారుకు హైకోర్టు అక్షింతలు


తెలంగాణ రాష్ట్రంలో వాహనాల రీరిజిస్ట్రేషన్ జరుగుతున్న తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా వాహనాల రీరిజిస్ట్రేషన్ చేస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. ఏపీ రిజిస్ట్రేషన్తో ఉన్న వాహనాలకు నెంబరు ప్లేట్లను 'టీఎస్' సిరీస్కు మారుస్తున్న విషయం తెలిసిందే.



ఈ విషయమై కోర్టులో దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top