సూర్యాపేట ఘటనతో అంతా హై అలర్ట్


హైదరాబాద్ : పోలీసులు నగరంలో హైఅలర్ట్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. హైదరాబాద్ లోని ప్రధాన కూడళ్లతో పాటు విజయవాడ జాతీయ రహదారిపై భారీగా పోలీసులను మోహరించారు. నగరంలో ప్రధాన ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. కొందరు అనుమానితులను అదుపులోనికి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.


ఉత్తరప్రదేశ్ మీరట్ ప్రాంతానికి చెందిన ఇర్ఫాన్ ను పోలీసులు అనుమానితుడిగా భావిస్తున్నారు. కాగా, ఇర్ఫాన్ దొంగల ముఠా సభ్యుడై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో దొరికి ఓటర్ ఐడీ కార్డులు నకిలీవని పోలీసులు పేర్కొంటున్నారు. కాల్పులకు పాల్పడింది ఖచ్చితంగా నార్త్ ఇండియన్స్ అని తెలుస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top