అమరుల కుటుంబాలను ఆదుకుంటాం
ఆంధ్రజ్యోతిపై ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు, లీగల్ నోటీసు: నాయిని
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో అమరులైన విద్యార్థుల కుటుంబాలను తమ ప్ర భుత్వం కచ్చితంగా ఆదుకుంటుందని హోం మం త్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను, అన్ని కార్యక్రమాలను దస రా పండుగ (అక్టోబర్ 2) తర్వాత అమలుచే స్తా మని చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
శుక్రవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఉస్మానియా విద్యార్థులను, అమరులను తాను కించపరిచినట్లుగా.. తన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన వార్తపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయడంతో పాటు ఆ పత్రిక యాజమాన్యానికి లీగల్ నోటీస్ను పంపిస్తున్నట్లు నాయిని తెలియజేశారు.
సంబంధిత వార్తలు