అంధకారంలో కరీంనగర్ జిల్లా
కరీంనగర్: కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో జిల్లాలోని పలు భారీ వృక్షాలు కరెంట్ వైర్లుపై పడి నెలకొరిగాయి. దీంతో జిల్లావ్యాప్తంగా అంధకారంలో చిక్కుకుంది. జగిత్యాల, సిరిసిల్లా డివిజన్లో భారీ ఎత్తున వృక్షాలు పడిపోయాయి. అలాగే పెద్దపల్లిలో భారీ వృక్షం పడి కారు పూర్తిగా ధ్వంసమైంది. ఇప్పటికే జిల్లాలో ఐదు విడతలుగా వడగళ్ల వాన కురిసింది.దీంతో పంటలన్నీ పూర్తిగా పాడైయ్యాయి. రైతులు దుఖః సాగరంలో మునిగిపోయారు.