ఎగిరిపోయిన రైల్వే స్టేషన్ పైకప్పు
వరంగల్: వరంగల్ నగరంలో బుధవారం ఉదయం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గాలుల తాకిడికి రైల్వే స్టేషన్లోని మొదటి ప్లాట్ఫామ్ పైకప్పు ధ్వంసమైంది. ప్లాట్ఫామ్పై రేకులు గాలికి ఎగిరి పడ్డాయి. సుమారు 150 అడుగుల మేర పైకప్పు దెబ్బతింది. దీంతో ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలను వెదుక్కొవాల్సి వచ్చింది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.
మరిన్ని వార్తలు