వరంగల్ జిల్లాలో గాలివాన బీభత్సం
చెన్నారావుపేట/నెక్కొండ: వరంగల్ జిల్లా చెన్నారావుపేట, నెక్కొండ మండలాల్లో మంగళవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. చెన్నారావుపేట మండలంలోని అమీన్పేట గ్రామంలో ఎంపీటీసీ పులిబాబుగౌడ్కు చెందిన కోళ్లఫారాలు ధ్వంసమయ్యాయి. సూర్యాపేట తండాలో విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్ అవడంతో మంటలు లేచి ఐదెకరాల్లో గడ్డి వాములు దగ్ధమయ్యాయి. అలాగే, కోనాపురంలో పాఠశాల పై కప్పు ఎగిరిపోయింది. మరో చోట భారీ వృక్షం కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు విఘాతం ఏర్పడింది.