భారీ వర్షాలు: చెరువులకు గండి


జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లిజిల్లాలోని మహాముత్తారం, పలిమల, కన్నాయిగూడెం, ఏటూరునాగారం, తాడ్వాయి మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ధాటికి మహాముత్తారం మండలం యమన్ పల్లి గ్రామంలోని సుందరమ్మ చెరువుకు బుధవారం భారీ గండి పడింది.దీంతో ఆ గ్రామస్థులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే చెరువుకు మరమ్మత్తు చర్యలు చేపట్టి వృథాగా పోతున్న నీటికి అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top