భాగ్యనగరంలో భారీవర్షం
హైదరాబాద్: భాగ్యనగరం తడిసిముద్దయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి భారీ వర్షం ప్రారంభమైంది. కుండపోతగా వర్షం రావడంతో రహదారులు జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కార్యాలయాల నుంచి ఇళ్లకు బయలుదేరిన ఉద్యోగులకు అవస్థలు తప్పలేదు.
రోడ్లపైకి పెద్ద ఎత్తున నీరు చేరడంతో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ స్తంబించింది. వినాయకచవితి నేపథ్యంలో ఏర్పాటు చేసిన దుకాణాలకూ వర్షం దెబ్బ తగిలింది. కొన్ని ప్రాంతాల్లో ఇంకా వర్షం కురుస్తూనేవుంది.